- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నల్లగొండ ప్రెస్ క్లబ్ సభ్యత్వ నమోదుకు శ్రీకారం..

దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందడుగు పడింది. ప్రెస్ క్లబ్ ను ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఐబీసీ ఛానెల్ ఎండీ.ఏచూరి భాస్కర్ ప్రారంభించారు. ఏచూరి భాస్కర్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులకు గురవుతున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. అలాగే ఫోటో,వీడియో జర్నలిస్టులతోసహా అందరి జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం అభినందనీయమని ఆయన కితాబిచ్చారు.
ప్రెస్ క్లబ్ లో అన్ని సంఘాల జర్నలిస్టులు మమేకం అయ్యి, ఒక్కటిగా ఉంటూ సమస్యలు పరిష్కారం చేయాలి అంటే ప్రెస్ క్లబ్ పాత్ర క్రియాశీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.అలాగే ఆయన సభ్యత్వం తీసుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పులి మామిడి మహేందర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి గాదె రమేష్ అందరికి సభ్యత్వాలు అందజేశారు.టి న్యూస్ ఉమ్మడి నల్లగొండ స్టాఫ్ రిపోర్టర్ బురా రాము,టీయూ డబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు జయశంకర్,కోశాధికారి రవి,క్రీడల కన్వీనర్ మధు,కోటి,జానయ్య,బోగరి రామకృష్ణ, విజయ్,సాయి,ఓడపల్లి మధు,యాదగిరి, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.