- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నల్లగొండ మున్సిపల్ బడ్జెట్ 125 కోట్లు : బుర్రి శ్రీనివాస్ రెడ్డి

దిశ,నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు.అధ్యక్షత వహించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కౌన్సిలర్ల తీర్మానం మేరకు పలు అభివృద్ధి పనులకు 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను 125 కోట్ల 78 లక్షల 40 వేల రూపాయలు బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ అండ్ బి,సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం తో నల్లగొండ ను అభివృద్ధి లో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మనం తీవ్రంగా నష్టపోయాం అన్నారు.కౌన్సిలర్లు కు తెలియకుండానే పనులు జరిగేవి అన్నారు.
అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ కలెక్టర్ తో తీసుకొని పనులు చేయించుకున్నారు.దశాబ్ది ఉత్సవాల పేరున దగా చేశారన్నారు. గతంలో ఉన్న పాలకులు చాలా అవకతవకలు కు పాల్పడ్డారు. వాటి మీద కూడా చర్యలు తీసుకుంటామని అలాగే మన నిధులు మొత్తం పక్కదారి పట్టాయి. నల్లగొండలో ఒక్క వాటర్ బకాయి బిల్లులే 18 కోట్లు రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి అన్నారు. మున్సిపాలిటీ ఆస్తులను పెంచే విధంగా మేము పనిచేస్తామని గత బడ్జెట్ కన్నా మెరుగ్గా పని అందరం కలిసి చేద్దామని మేము ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం అన్నారు.మర్రిగూడ జంక్షన్ లో 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. ఎలాంటి ముందు చూపు లేకపోవడం వల్ల ఫ్లై ఓవర్ వల్ల నిర్వీర్యం అయ్యే స్థితికి వచ్చింది అని అభివృద్ధి పథంలో నల్లగొండ ను తీసుకెళ్తామని అన్నారు.
ప్రభుత్వ బడులను కాపాడాలి :ఎం ఎల్ సి నర్సిరెడ్డి.
గతంలో జరిగిన అతి దుబారా ఖర్చును కౌన్సిలర్లు ప్రశ్నించారు ఇది శుభ పరిణామం అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పటిష్టంగా ఉండాలి నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో 25 ప్రాథమిక పాఠశాలల ఉన్నాయి.అందులో 4 పాఠశాలల మాత్రమే మెరుగ్గా ఉన్నాయి దాదాపు 18 పాఠశాలలు పైగా విద్యార్థులు లేక నిర్వీర్యం అవుతున్నాయి అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేకపోతే ఉపాధ్యాయులను నిందించవద్దు అన్నారు.ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి అన్నారు.మున్సిపల్ కౌన్సిలర్లు వీటి మీద దృష్టి పెట్టాలి అన్నారు.
అవినీతి వాళ్లు చేసిన అధికారులే దోషులు అవుతారు : మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్
నల్లగొండ మున్సిపాలిటీ లో అవినీతి జరిగింది అనడానికి పక్క లెక్కలు ఉన్నాయన్నారు.అధికారంలో ఉండి స్వ పక్ష నాయకులను అడిగిన చెప్పకుండా కలెక్టర్ ద్వారా పర్మిషన్ తీసుకొని పనులు చేశారు అన్నారు.అవినీతి చేసిన వారి మీద తప్పక చర్యలు ఉంటాయి.ఆదాయ వనరులు కాపాడుకునేలా పని చేయాలి. అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి అవినీతి చేయడానికి అధికారులు ఆస్కారం ఇవ్వొద్దు ఇస్తే మాత్రం మీరే దోషులు అవుతారు అన్నారు.
గంపడంత ఆశతో గెలిచి చెంచాడు పనిచేయలేదు :కుయ్యుమ్ బేగ్ కౌన్సిలర్.
బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ గంపెడు ఆశతో గెలిచి చెంచాడు పనిచేయలేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపాలిటీ వ్యవస్థ భ్రష్టు పట్టింది నేడు 125 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెడితే గతంలో 719 కోట్లతో బడ్జెట్ ను కేటాయించారు అంకెల గారడి మాత్రమే ఉందని అవగాహన లేని బడ్జెట్ గతంలో పెట్టారన్నారు 33 కోట్ల 90 లక్షలకు అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్లు కలెక్టర్ ద్వారా తెచ్చుకున్నారన్నారు నల్లగొండలో పనులన్నీ నాసిరకంగా జరిగాయన్నారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని అన్నారు.
గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 719 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 125 కోట్ల రూపాయలు సుమారు 593 కోట్ల బడ్జెట్ తేడా ఉంది దానికి గల కారణం ఖర్చులు తగ్గించుకుని బడ్జెట్ ని పెట్టినట్లు తెలుస్తుంది. దుబారా ఖర్చులు లేకుండా చూశారు.ప్రతి ఒక్కరికి సమావేశంలో మాట్లాడే అవకాశం ఇచ్చారు.నల్గొండ లోని గొల్లగూడెం లోని శ్మశాన వాటికలో కనీస మౌలిక వసతులు లేవు అని పెద్ద బండ గొల్ల గూడా కౌన్సిలర్ శ్రీనివాస్ చైర్మన్ కు వినతిపత్రం అందజేశారు.ఈ బడ్జెట్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అధికారులు,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.