- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సరైన తేమశాతం ఉంటే ధాన్యాన్ని అదే రోజు కొనుగోలు చేయాలి.. కలెక్టర్

దిశ, కనగల్లు : తేమ శాతం 17 కు మించకుండా కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని అదే రోజు కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం రాత్రి కురిసిన వర్షం వల్ల నల్గొండ జిల్లా, కనగల్ మండలం, పొనుగోడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిందని తెలియగా ఆదివారం ఆమె పొనుగోడు కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరైన తేమశాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని అదే రోజే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని, ఒకవేళ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా జాప్యం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను లోతట్టు ప్రాంతాల్లో కాకుండా, ఎత్తు ప్రాంతాలలో ఏర్పాటు చేసినట్లయితే కొనుగోలు కేంద్రంలోకి వర్షానికి నీరు రాకుండా ఉంటుందని కలెక్టర్ సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ప్రతిరోజు తేమశాతాన్ని నమోదు చేయాలని, రిజిస్టర్ లను తప్పనిసరిగా నిర్వహించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో లారీలు సరిగా ఏర్పాటు చేయనట్లయితే కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడారు. డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఆర్డీఓ అశోక్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, కేంద్రం నిర్వాహకులు, తదితరులు ఉన్నారు.