- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నిర్లక్ష్యం వహిస్తే నోటీసులు ఉండవు... సస్పెండే

దిశ, మర్రిగూడ : గ్రామాల్లో అభివృద్ధి పనుల పై అధికారులు నిర్లక్ష్యం చేస్తే నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ గా సస్పెండ్ ఉత్తర్వులే జారీ చేస్తానని నల్గొండ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను హెచ్చరించారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రజావాణి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను మండల స్థాయిలోనే పరిష్కరించాలని జిల్లా కేంద్రానికి రాకుండా అధికారులే మండల స్థాయిలోనే పరిష్కరించాలని సూచించారు.
గ్రామాల్లో ప్రత్యేక పాలన కొనసాగుతున్నందున అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను వారంలోనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అభివృద్ధి విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధిని గ్రామాల్లో పరుగులు పెట్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీవో డి.సుబ్రహ్మణ్యం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఎంపీడీవో స్వర్ణ మేరీ కుమారి, ఏడు దొడ్ల ఎంపీపీ శ్వేతా రవీందర్ రెడ్డి, ఎమ్మార్వో దశరథ సింగ్ లు పాల్గొనగా నూతనంగా వచ్చిన కలెక్టర్కు ఎంపీపీ దంపతులతో పాటు అధికారులు శాలువాతో సన్మానించారు.