- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నకిరేకల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా : వేముల వీరేశం

దిశ,నకిరేకల్ టౌన్ : రాబోయే రోజుల్లో నకిరేకల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. అఖిలపక్షం నాయకులు అధికారులతో కలిసి మంగళవారం పట్టణంలోని ప్రధాన సెంటర్ లో నిర్మితమవుతున్న రింగ్ రోడ్డు, ఆస్పత్రి పక్కన ట్రాన్స్ఫార్మర్, మెయిన్ రోడ్డు నందు నిర్మాణంలో ఉన్న డ్రైనేజీలు, సాయిబాబా గుడి పక్కన డ్రైనేజీలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోవు తరాలకు పట్టణంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేలా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాన సెంటర్ లో రింగు వలన స్థానికులకు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. డ్రైనేజీల వల్ల సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు చేయాలని అధికారులకు సూచించారు. గత పాలకుల పట్టింపు లేని తనం వల్ల పట్టణంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వ్యాసారపు వెంకన్న, చౌగోని శ్రీనివాస్, పన్నాల శ్రీనివాసరెడ్డి, లింగాల వెంకన్న, పన్నాల రాఘవరెడ్డి, నాగులంచ వెంకటేశ్వర్లు, ఉప్పల రమేష్, గడ్డం స్వామి, బానోతు వెంకన్న, గాజుల సుకన్య, ఏసు పాదం, తదితరులు పాల్గొన్నారు.