- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు సోమవారం ఎత్తివేసే అవకాశం ?

దిశ,నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్కు భారీగా ఇన్ఫ్లో వస్తుండగా..కృష్ణానదికి వరద పోటెత్తగా ప్రాజెక్టులన్నీ నిండుకుండ లయ్యాయి.శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తూనే ఉంది. జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో : 4,54,710 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 5,16,501 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం : 883.800 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 204.7888 టీఎంసీలుగా ఉంది. కుడి ,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ ఇన్ ఫ్లో : 4,19,588 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 34,088 క్యూసెక్కులకు చేరుకుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 561.40 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం : 312.50 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 231.9106 టీఎంసీలకు చేరుకుంది.
నాగార్జున సాగర్కు భారీగా ఇన్ఫ్లో వస్తుండగా, సోమవారం రోజు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని సమాచారం ఉంది. అయితే ఏ క్షణమైనా సాగర్ గేట్లు తెరిచే అవకాశం ఉందని, అదికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ సూచించారు.డ్యాం భద్రతకు ఢోకా లేకుండా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేయాలన్నారు. కంట్రోల్ రూమ్లో నీటి నివేదికలను జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. డ్యామ్ నిర్వహణకు సంబంధించి కంట్రోల్ రూమ్ ఆంధ్రా ఆధీనంలో ఉన్నందున ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు.
ఆయకట్టులో ఊపందుకున్న వ్యవసాయ పనులు
ఈ క్రమంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ముందుగానే నీరు వస్తుండడంతో సాగర్ ఆయకట్టు అంతటా సాగు సందడి నెలకొంది. జలాశయం నుంచి ఎడమ కాలువకు నీటి సరఫరా జరుగుతోంది.ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరిసాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. కాలువకు నీరు విడుదల కాగానే వరి నారుమళ్లు పోసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు రైతులు. ఆయకట్టులో వరిసాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి
నాగార్జునసాగర్ కు మొదలైన పర్యాటకుల తాకిడి..
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ లో పర్యాటకుల సందడి ఊపందుకుంది. శ్రీశైలం నుండి నాగార్జునసాగర్కు నీరు వచ్చి చేరుతున్న శ్రీశైలం నుండి నాగార్జునసాగర్కు నీరు వచ్చి చేరుతున్న కారణంగా, శని, ఆదివారాలు సెలవుదినాలు కావడంతో సాగర్ సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ ఉంది. కారణంగా, శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సెలవు దినం కావడంతో పర్యాటకుల సందడి నెలకొంది. రాష్ట్రం నుంచేగాక ఏపీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సాగర్ అందాలను తిలకించేందుకు ఇక్క డికి వచ్చారు. సాగర్లో పర్యాటక ప్రాంతాలైన డౌన్ పార్క్ ,బుద్ధవనం, అనుపు, ఎత్తిపోతల, కొత్త వంతెన తదితర ప్రాంతాల్లో పర్యాటకులు సందడి చేస్తున్నారు