- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వంద రోజుల్లోనే 100 కోట్లకు పైగా అభివృద్ధి పనులు : మందుల సామెల్

దిశ,తుంగతుర్తి : తన 100 రోజుల పాలనలో 100 కోట్లకు పైగా నిధులను తీసుకొచ్చి తుంగతుర్తి ప్రాంత అభివృద్ధి చేపడుతున్నామని శాసనసభ్యులు మందుల సామెల్ వెల్లడించారు. ఇది తుంగతుర్తి చరిత్రకే ఒక తలమానికమని స్పష్టం చేశారు. వంద రోజుల పాలన ఎంతో సంతృప్తినివ్వడమే కాకుండా గర్వపడుతున్నానని పేర్కొన్నారు.తుంగతుర్తి మండల కేంద్రంలో రూ.ఒక కోటితో నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలను ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నారని ఈ మేరకు వాటన్నింటినీ అంచలంచలుగా పరిష్కరిస్తున్నానని తెలిపారు.నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రూ.44 కోట్లతో,రూ.పది కోట్ల వ్యయంతో గిరిజన తండాలకు,రూ 13 కోట్ల వ్యయంతో వివిధ గ్రామాలలో సిసి రోడ్లు,వెలుగుపల్లి-పర్సాయపల్లి గ్రామాల మధ్య రూ.6 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు.రూ.16 కోట్ల వ్యయంతో తుంగతుర్తిలోని జాతీయ రహదారి నుండి రావులపల్లి క్రాస్ రోడ్ వరకు రోడ్డు,శాలిగౌరారం మండలంలో రూ.25 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.
తిరుమలగిరి మండలంతో పాటు పరిసర గ్రామాల ప్రజల చిరకాల వాంచగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం అది ప్రారంభమవుతుందని తెలిపారు.ధర్మారం,గుమ్మడవెల్లి గ్రామాల చెరువుల అభివృద్ధికి రూ.14 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.త్వరలోనే తిమ్మాపురం-కోడూరు-సంగేమ్- అన్నారం,చిల్పకుంట్ల-నూతనకల్ ప్రాంతాల ప్రధాన రహదారులను నిర్మిస్తున్నామని వివరించారు.ఇవే కాకుండా మోత్కూరు,అడ్డగూడూరు,తిరుమలగిరి,నాగారం, అర్వపల్లి,శాలిగౌరారం,తుంగతుర్తి,మద్దిరాల,నూతనకల్ మండలాలలో ఖర్చులకు వెనకాడకుండా ప్రజా సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.కార్యక్రమంలో తహసిల్దార్ రమణారెడ్డి, మండల పంచాయతీ అధికారి భీమ్ సింగ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్,నాయకులు రాజయ్య, సత్యనారాయణ,తిరుమలప్రగడ కిషన్ రావు,తదితరులు పాల్గొన్నారు.