- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బడ్జెట్లో వికలాంగులకు అధిక నిధులు కేటాయించాలి

దిశ, మునగాల: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న తొలి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని బీవీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ అన్నారు. గురువారం మండల పరిధిలోని తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో నిర్వహించిన ఆ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తొలి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి రూ. 300 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను తమ సంఘం ఆధ్వర్యంలో కలిసి విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. ఇల్లు లేని నిరుపేద వికలాంగులకు పది లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని సబ్సిడీ రుణాలు కోసం ఎదురుచూస్తున్న వికలాంగులకు వెంటనే బ్యాంకు లింక్స్ సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలని వికలాంగుల పెన్షన్ రూ. 6000కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఈదయ బాబు, జిల్లా అధ్యక్షులు కుర్ర గోపి, మదన్ మోహన్ రెడ్డి ,సైదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పిచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.