ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోడీ ప్రభుత్వం : ఆలేరు ఎమ్మెల్యే

by Aamani |
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మోడీ ప్రభుత్వం : ఆలేరు ఎమ్మెల్యే
X

దిశ,ఆత్మకూరు (ఎం) : ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పార్లమెంట్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే,వారిపై అక్రమంగా ఈడీ కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను చార్జిషీట్లో చేర్చడానికి నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పై ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు బైఠాయించి ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ త్యాగాల గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కు దేశంలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక,రాహుల్ గాంధీ ప్రభంజనాన్ని తట్టుకోలేక, త్యాగాల గాంధీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడం బాధాకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మతోన్మాద శక్తుల తోటి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మోడీ, అమిత్ షాకు తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి జిల్లా నాయకులు ఎల్లంల సంజీవరెడ్డి పిఎసిఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి మాజీ ప్రజా ప్రతినిధులు తండా మంగమ్మ శ్రీశైలం గౌడ్, కే నరేందర్ గుప్తా, జన్నాయి కోడె నగేష్, దొంతర బోయిన నవ్య భాస్కర్, మండల నాయకులు ముద్దసాని సిద్ధులు గౌడ్, బత్తిని ఉప్పలయ్య, కందడి అనంతరెడ్డి, మామిడి మోహన్ రెడ్డి,మల్లేశం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed