తెలంగాణకు మోడీ అన్యాయం చేశారు : ఎమ్మెల్యే, ఎంపీ

by Naveena |
తెలంగాణకు మోడీ అన్యాయం చేశారు : ఎమ్మెల్యే, ఎంపీ
X

దిశ,‌యాదాద్రి భువనగిరి ప్రతినిధి : దేశంలోని ఇతర రాష్ట్రాలపై ఉన్న ప్రేమ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణపై లేదని, ముచ్చటగా మూడో సారి గెలిచి తెలంగాణకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం చేశారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం‌ అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆదివారం వారు భువనగిరిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నీళ్ళు, నిధులు నియామకాలతో తెచ్చుకున్న తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.2014 నుంచి బీజేపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి కేసీఆర్ నియంత పోకడతో నరేంద్ర మోడీకి ఏనాడు కూడా ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రిని స్వీకరించలేదన్నారు.

మ్యాచింగ్ గ్రాంట్స్ 40 శాతం తెలంగాణ పెడితే 60 కేంద్రం ఇవ్వాల్సిన వాటాలో మనకు ఎంత ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు, పేరుకే మున్సిపాలిటీలుగా మార్చుకున్నామని, కానీ కేంద్రం నుండి ఎలాంటి గ్రాంట్స్ మంజూరు చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వంతో అనేకసార్లు నిధుల మంజూరు కొరకు విశ్రమించని ప్రయత్నం చేశారన్నారు. గుజరాత్ మోడల్ గా చేసుకున్నారని, అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా రేవంత్ రెడ్డి అడిగితే ఇపుడు బడ్జెట్ లో తెలంగాణకు చోటు కల్పించలేదని చెప్పారు. విభజన హామీలు కూడా అమలు చేయలేదని, చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం నుండి 5 శాతం జీడీపీ వరకు వచ్చిన కూడా కేంద్రం నుండి రావాల్సిన నిధులు రాలేదని విమర్శించారు. కేంద్రానికి ఢిల్లీ, బీహార్ ఎన్నికలు కనిపిస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రం కనిపించడం లేదన్నారు.

లక్ష అరవై మూడు కోట్లు తెలంగాణ అభివృద్ధి కోసం అడిగిన కూడా నిధులు కేటాయించలేదన్నారు. మూసీ ప్రక్షాళన కోసం అడిగిన ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం శోచనీయమన్నారు. ఉరికే ఢిల్లీకి కాంగ్రెస్ మంత్రులు వెళ్తుంటారని కేటీఆర్ మాట్లాడుతున్నారని, నిధుల కోసం,అభివృద్ధి కోసం వెళ్తున్నారని అర్థం కాకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.‌ తెలంగాణకు అన్యాయం జరిగిందని కోడైకొస్తున్న బీజేపీ ఎంపీలకు అర్థం అవ్వట్లేదా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ బ్రహ్మాండమైన బడ్జెట్ అంటున్నారని, వారికి బడ్జెట్ లో తెలంగాణాకు జరిగిన అన్యాయం గుర్తించడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నిధులను డాక్యుమెంట్ లో విడుదల చేస్తామని చెప్పారు. తెలంగాణ గురించి ఒక నిమిషం కూడా నిర్మల సీతారామన్ మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ల నియంత్రణ చేయలేనప్పుడు కోట్ల రూపాయలు పెట్టి విమాన శ్రయలు నిర్మించడం దేనికన్నారు‌. 10 సంవత్సరాల నుండి జరిగిన అన్యాయం మళ్ళీ జరుగుతుందని, బీజేపీ ఎంపీలు తెలంగాణ తరుపున గళం ఎత్తాల్సిన అవసరం ఉందన్నారు‌ . రైతు రుణమాఫీ చేశామని, ఇంకా కూడా ప్రజల కోసం అనేక విధాలుగా ప్రజలకు మేము అండగా ఉంటామన్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులను బీజేపీ ఎంపీలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.



Next Story

Most Viewed