వాలీబాల్ టోర్నమెంట్ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే..

by Sumithra |   ( Updated:2025-03-06 11:45:15.0  )
వాలీబాల్ టోర్నమెంట్ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే..
X

దిశ, చింతపల్లి : చింతపల్లి మండల కేంద్రంలో ఈ నెల 10 న చింతపల్లి ప్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే దేవరకొండ డివిజన్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కరపత్రాన్ని బుధవారం ఎమ్మెల్యే బాలు నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బాలు నాయక్ ను టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, మాజీ ఎంపీపీ భవాని పవన్ కుమార్, సంజీవరెడ్డి, యాది గౌడు, అంగిరేకుల గోవర్ధన్, హరిలాల్ నాయక్, సదానందం, గుణమోని కొండలు యాదవ్, చిక్కొండ సాయిరాం, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆలీ, గౌరవ అధ్యక్షుడు బాబన్న, తదితరులు పాల్గొన్నారు.



Next Story