- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మునుగోడుపై ఎమ్మెల్యే చిన్న చూపు విడనాడాలి: కాంగ్రెస్ అధ్యక్షుడు
దిశ, మునుగోడు: నియోజకవర్గ కేంద్రమైన మునుగోడులో రెవెన్యూ డివిజన్ కార్యాలయం, 100 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేయకుండా స్థానిక ఎమ్మెల్యే చిన్న చూపు చూస్తున్నారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సురిగి నర్సింహా గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద మునుగోడు హక్కుల సాధనకై చేపట్టిన నిరాహార దీక్షకు మండల కాంగ్రెస్ పార్టీ తరుపున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడుకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో వారికి ప్రజలు గుణపాఠం చెప్పకు తప్పదని హెచ్చరించారు. మునుగోడు మండలంలో ప్రభుత్వ డిగ్రీ ఇంటర్ కళాశాల, 30 పడకల ఆసుపత్రి, రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని నియమించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు మేక ప్రదీప్ రెడ్డి, కిస్టాపురం ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, పట్టణాధ్యక్షుడు యాసరాని దినేష్ కుమార్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నక్క వెంకన్న యాదవ్, నాయకులు కొంక రాజభాస్కర్, కర్నాటి యాదయ్య, పులకర హనుమంతు, తదితరులున్నారు.