మొక్కలు నాటిన ఎమ్మెల్యే బీర్ల, ఎమ్మెల్సీ తీన్మార్…

by Kalyani |
మొక్కలు నాటిన ఎమ్మెల్యే బీర్ల, ఎమ్మెల్సీ తీన్మార్…
X

దిశ,ఎం,తుర్కపల్లి : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంగళవారం పర్యటించారు. బద్దు తండ గ్రామంలో వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు. అనంతరం సిత్లా పండుగ సందర్భంగా బంజారాలతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. తిరుమలపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. నాటిన మొక్కలన్నిటిని ప్రతి ఒక్కరూ సంరక్షించాలని కోరారు.

మొక్కలు నాటి వాటిని పర్యవేక్షించే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుందని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. అనంతరం గంధమల్ల గ్రామంలో గంధమల్ల నుంచి భువనగిరి వరకు బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించి ప్రారంభించారు. కొద్ది దూరం వరకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దేశ్యా నాయక్ ,ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి ఎం పి ఓ వెంకటేశ్వర్లు ఏపీఓ నర్సయ్య , ఈసి యశోద, మండల అధికారులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed