MLA Balu Naik : జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారం..

by Sumithra |
MLA Balu Naik : జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారం..
X

దిశ, డిండి : మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులతో, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవకోటి మనుగడకు మొక్కలే ఆధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత విషయంలో పిచ్చి మొక్కలను తొలగించి, మురుగు కాలువలను శుభ్రం చేయాలని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించాలన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈజె గార్డెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్ అర్హులైన 67 మంది లబ్ధిదారులకు 20 లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు, మహిళల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. మండల కేంద్రంలో అంబులెన్స్ 108 ను అతిత్వరలో మంజూరు చేస్తామని, ఐబీ క్వార్టర్స్ నీళ్ల ట్యాంక్ నుండి అంగడి బజార్ మీదుగా వ్యవసాయ క్షేత్రం వరకు బీటీ డబుల్ రోడ్డును త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 వరకు ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డానియల్, ప్రిన్సిపాల్ కరుణాకర్, నాయకులు వెంకటేశ్వర్ రావు, రాజేష్ రెడ్డి, సిరాజ్ ఖాన్, భీముడు, లక్ష్మణ్, సాయమ్మ కాశన్న, అబ్దుల్ ఖాదర్, వెంకటేష్, ఉమర్, సాయిబాబు, పోషాలు, రాములు, సాయి, శైలేష్, ఆనంద్, మైనోద్దీన్, వెంకటయ్య, కనకాచారి, మల్లేష్, సలీం, శ్రీనివాస్ గౌడ్, రహీం, కృష్ణ, కలీమ్, షబ్బీర్, గౌస్, అజయ్, మహిళా సంఘాల మహిళలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed