రేపు చందంపేటకు రానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

by Sumithra |
రేపు చందంపేటకు రానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, చింతపల్లి (చందంపేట్) : నల్గొండ జిల్లా, చందంపేట తహశీల్దార్ కార్యాలయ సమీపంలో సోమవారం భూ భారతి చట్టం -2025 పై నిర్వహించనున్న అవగాహన సదస్సుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. 21 న మంత్రి ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి 10:30 గంటలకు చందంపేట చేరుకొని 12 గంటల వరకు భూ భారతి చట్టం పై నిర్వహించే అవగాహన సదస్సులో పాల్గొంటారని. అనంతరం 12 గంటలకు చందంపేట నుండి బయలు దేరి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం వెళ్తారని ఆమె వెల్లడించారు. చందంపేటలో నిర్వహించనున్న భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆమె కోరారు.



Next Story

Most Viewed