- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సాగర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు

దిశ, నాగార్జునసాగర్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సభ్యులు గత రెండు రోజులుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని పలు ప్రాంతాలను సందర్శించి పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం , భద్రత , నీటి వినియోగం, విద్యుత్ ఉత్పత్తి లాంటి పలు అంశాలపై పూర్తి నివేదికను తయారు చేస్తున్నారు. దీనిపై బుధవారం నాగార్జునసాగర్ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా జెన్కో చీఫ్ ఇంజనీర్ మంగేష్ కుమార్ ఆధ్వర్యంలో జెన్కో సమావేశ మందిరంలో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో సాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పుడు ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఎంత మేరకు విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది, ఎంత పరిమాణంలో నీటిని వినియోగిస్తున్నాం, ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో రివర్స్ బుల్ టర్ బండ్ల పనితీరు , రివర్స్ బుల్ టర్బైన్లు పనిచేస్తున్నప్పుడు జలాశయంలోకి నీటిని పంపే ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా లాంటి పూర్తి వివరాలను సంబంధిత జెన్కో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం చైర్మన్ ప్రస్తుత సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేష్ కుమార్, సీడబ్ల్యూసీ డైరెక్టర్ ఆశిష్ కుమార్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డైరెక్టర్ మహేంద్రసింగ్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చీఫ్ ఇంజనీర్ కుమార్ , స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎస్ ఇ మురళీకృష్ణ ,నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ జిషన్, నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ సాంకేతిక నిపుణులు రాకేష్ తదితరులు ఉన్నారు. కాగా ఈ బృందం సాగర్ సందర్శనలో భాగంగా ప్రపంచంలోనే రెండవ పురావస్తు ఐలాండ్ మ్యూజియం అయినా నాగార్జునకొండను సందర్శించారు.