- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఈనెల 8న జరిగే మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి

దిశ, కోదాడ : కోదాడ జూనియర్ సివిల్ కోర్టు లో జూన్ 8న జరగబోయే లోక్ అదాలత్ ను సద్వినియోగం కోవాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్యాంసుందర్ అన్నారు. గురువారం కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కక్షీ దారులకు లోక్ అదాలత్ గురించి చైతన్య పరచాలని న్యాయవాదులను కోరారు. ఈ సమావేశంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సిహెచ్ సత్యనారాయణ,పి.పి బొబ్బ కోటిరెడ్డి , బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, బార్ అసోసియేషన్ సభ్యులు మంద వెంకటేశ్వర్లు, కోడూరు వెంకటేశ్వర్లు, హేమలత, దొడ్డ శ్రీధర్, ఎస్.కె నాగుల్ పాషా, సీనియర్ న్యాయవాదులు వి రంగారావు, సిలివేరు వెంకటేశ్వర్లు షేక్ అబ్దుల్ రహీం ,ఉయ్యాల నరసయ్య, రంజాన్ భాష, రియాజ్, బాలయ్య, శరత్ కుమార్, మండల లీగల్ సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.