రోగులకు వైద్య సేవలు సకాలంలో అందించాలి.. కలెక్టర్

by Sumithra |
రోగులకు వైద్య సేవలు సకాలంలో అందించాలి.. కలెక్టర్
X

దిశ , సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ శనివారం ఆకస్మికంగా చేరుకొని ఆసుపత్రి ప్రాంగణంలో పాటు ఆయా వార్డులు, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులను వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫార్మసీ గదిని పరిశీలించి నిల్వ ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతో బాధతో వచ్చిన రోగులతో వైద్య సిబ్బంది మర్యాదగా మాట్లాడి వారికి కావలసిన సేవలను తక్షణమే అందించాలని ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.



Next Story

Most Viewed