- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మెడికల్ కాలేజ్ తరలింపు మానుకోవాలి : మాజీ ఎమ్మెల్యే

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టకు మంజూరు చేసిన మెడికల్ కాలేజ్ను సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్కు తరలించుకుపోవడానికి కుట్ర చేస్తున్నడని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ ఆలోచన మానుకోకపోతే రిలే నిరాహార దీక్షకు దిగుతానని అన్నారు. గురువారం యాదగిరిగుట్టలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాదాద్రి ఆలయానికి 55 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేదని, కానీ కేసీఆర్ రూ. 1250 కోట్లు కేటాయించి ఈ తరంలో అద్బుతమైన దేవాలయాన్ని పునః నిర్మాణం చేశారన్నారు. ఈ ఆలయానికి ప్రపంచ స్థాయిలో గ్రీన్ ఆఫీల్ అవార్డు సైతం ఇచ్చారని, దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఐదు అవార్టులు వచ్చాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నలుగురికి ఆదర్శంగా ఉండాలే కానీ, అసహ్యించుకునే విధంగా పాలన చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేసీఆర్తో గత ప్రభుత్వంలో వైద్య కళాశాల మంజూరు చేయించామని, బీబీనగర్లో ఎయిమ్స్ ఉన్నప్పటికి యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాలను తీసుకువచ్చామని వెల్లడించారు. యాదాద్రి దేవాలయానికి వచ్చి, వెళ్లే భక్తుల సౌకర్యార్ధం 100 పడకల ఆస్పత్రిని 2022 నవంబర్ 29 లో శంకుస్థాపన చేసుకున్నామన్నారు. యాదాద్రీశుడి పేరుపై వైద్య కళాశాల ఆ వెంటనే జీవో నెంబర్ 85 తో 5జూలై 2023లో మంజూరీ చేయించామని, శంకుస్థాపన చేయాలని అనుకున్నప్పటికి స్థలం లేక శంకుస్థాపన చేయలేదన్నారు.
సర్వే నెంబర్ 64 ను గుర్తించి అక్కడ నిర్మాణం చేయాలని అనుకున్నామని, 20 ఎకరాలు మెడికల్ కళాశాలకు అప్పటి కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు మెడికల్ కళాశాల కావాలంటే నిధులు కేటాయించి, నిధులు మంజూరు చేయాలి కానీ, కొడంగల్ వైద్య కళాశాల కోసం యాదాద్రికి కేటాయించిన దానిని ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన కళాశాలను తీసుకెళ్తే ఊరుకునేది లేదని, జీవోను తుంగలో తొక్కి.. కొడంగల్కు తీసుకుపోతే ఊరుకోమని హెచ్చరించారు. మెడికల్ కళాశాలకు 300 పడకల ఆస్పత్రి ఖచ్చితంగా ఉంటుందని, దూరదృష్టితో సర్వే నంబర్ 64లో మెడికల్ కళాశాల కోసం స్థలం చూశామని, 20 ఎకరాలు సరిపోక పోతే మిగిలిన స్థలంలో నిర్మాణం చేసుకోవచ్చని ఆలోచించామన్నారు.
ఈ నెల చివరి వరకు అనుకూలమైన నిర్ణయం వస్తుందని అనుకుంటున్నామన్నారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని, కొడంగల్ ప్రజలే కాదని యాదాద్రి ప్రజలు కూడా ఉన్నారని గుర్తుంచుకోండని చెప్పారు. త్వరితగతిన 100 పడకల ఆస్పత్రి, వైద్య కళాశాలను నిర్మాణం చేయాలని, మార్చి 1వ తేదీ వరకు వైద్య కళాశాల ఉంటుందని ప్రకటించకపోతే స్వయంగా రిలే నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఈ ప్రాంతం మీద ప్రేమ, చిత్తశుద్ది ఉంటే వైద్య కళాశాల ఉండాలని కాంగ్రెస్ నాయకులు సైతం పట్టుపట్టాలని, ఇక్కడ వైద్య కళాశాల ఉంటే వేల ఉద్యోగాలు ఉండటంతో పాటు వేల ప్రాణాలు కాపాడొచ్చని, మానవత్వం ఆలోచన చేయాలని సూచించారు. దీనిపై 1వ తేదీ నిర్ణయం తీసుకొని, కార్యాచరణ చేపడతామన్నారు.