- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పురుగుల మందు తాగి వివాహిత మృతి
by Naveena |

X
దిశ, చండూరు : పురుగుల మందు తాగి వివాహిత మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన దొటి వెంకటమ్మ (39) గత కొంత కాలంగా వ్యవసాయ భూమికి సంబంధించి తగదాలు ఉండటంతో..వాటిని మనసులో పెట్టుకుంది. అయితే మానసిక వేదనతో తన ఇంట్లో ఎవరు లేని సమయంలో మోనో మందు తాగి ఆపస్మారక స్థితిలో పడి ఉందని తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతురాలి భర్త యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు యస్. ఐ వెంకన్న తెలిపారు.
Next Story