డిజిటల్ క్లాసులను ప్రారంభించిన మంచు లక్ష్మి

by Kalyani |
డిజిటల్ క్లాసులను ప్రారంభించిన మంచు లక్ష్మి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని భాగవత్ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ లను సోమవారం సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ… 2022 నుంచి తమ టీమ్ ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పారు. తమ టీమ్ కు సహకరించిన జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తమ తాత ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేశారని, తమ తండ్రి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారని గుర్తు చేశారు.

భువనగిరి మండలంలోని వడపర్తి, రామన్నపేట మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. టీచ్ ఫర్ చెంజ్ సంస్థ మాట చెప్పేవాళ్ళం కాదని, చెప్పిన మాట చేసి చూపెడుతం అని వెల్లడించారు. తమ తాత ఊరు మోదుగుల పాలెం లో స్మార్ట్ క్లాస్ ను ఏర్పాటు చేశామన్నారు. మంచిగా క్లాస్ లు చెప్పే టీచర్లకు ల్యాప్ ట్యాప్ లు అందిస్తున్నామని పేర్కొన్నారు. తమకు అన్ని పార్టీల మద్దతు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు జండగే, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కంట్రోల్ ఎస్ అండ్ క్లౌడ్ 4 సి సంస్థ సీఈఓ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed