యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ

by Sridhar Babu |
యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ
X

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : సోమవారం నుండి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలి పారు. ఇటీవల జరిగిన పార్లమెంట్, శాసన మండలి ఎన్నికలు ముగియడంతో ఎన్నికల సంఘం కోడ్ ఎత్తివేయడం జరిగిందని, జిల్లాతో పాటు అన్ని మండలంలో తహసీ ల్దార్ల కార్యాలయాల్లో సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా చేపట్టాలని, ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పక హాజరు కావాలని కోరారు.



Next Story