పురుగుల మందు తాగి వ్యక్తి మృతి..

by Naresh |
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి..
X

దిశ, హుజూర్ నగర్: వ్యక్తిగత విషయాలు మనసులో పెట్టుకొని పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హుజూర్ నగర్ మండలంలోని లింగగిరి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. హుజుర్ నగర్ ఎస్సై ముత్తయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లింగగిరి గ్రామానికి చెందిన పంగ సైదులు (48) కు భార్య, ఇద్దరు కుమారులు సంతానం. గతంలో చిన్న కుమారుడు చనిపోగా, భార్య కూడా 2020లో చనిపోగా అప్పటి నుంచి మృతుడు సైదులు బాగా మద్యానికి బానిస అయ్యాడని తెలిపారు. త్రగినప్పుడల్ల తన భార్య కుమారుడిని గుర్తు చేసుకుంటూ ఉండేవాడని అన్నారు.అదేవిధంగా ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో బాగా మద్యం త్రాగి, గ్రామ శివారులోని మామిడితోటలోకి వెళ్లి ఏదో తెలియని పురుగుల మందు తాగి పోయాడని తెలిపారు . మామిడి తోటలో అతనిని గమనించిన గ్రామస్తులు బంధువులకు తెలియపర్చగా, వెంటనే బంధువులు హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్ళగా అప్పటికే మరణించినట్లుగా గుర్తించారని తెలిపారు. మృతుని పెద్ద కుమారుడు పంగ మహేష్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై ముత్తయ్య తెలిపారు.



Next Story

Most Viewed