అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

by Naveena |
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ,తుంగతుర్తి: అప్పుల బాధతో పాటు భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఎస్సై ఆర్.క్రాంతి కుమార్ గురువారం వెల్లడించారు. చింతకుంట్ల వెంకన్న (33) వ్యవసాయం సాగులో అప్పుల పాలయ్యారు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల క్రితం భార్య పిల్లలను తీసుకొని తన తల్లి గారి గ్రామమైన వెలుగుపల్లి కి (తుంగతుర్తి మండలం) వెళ్ళింది. అప్పటి నుండి వెంకన్న మానసికంగా కుంగిపోవడంతో పాటు అప్పుల బాధ భరించలేక తన ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన తండ్రి దేవయ్య హుటాహుటిన తుంగతుర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా..అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. తండ్రి దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు.



Next Story

Most Viewed