వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు

by Naveena |
వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాలు
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బంగారు విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవం అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మూడవ రోజు శుక్రవారం వానమామలై మఠం 31 వ పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజలు కొనసాగాయి. దేవస్థానం చేపట్టిన పంచకుండాత్మక మహాయాగంలో శాస్త్రోక్తంగా క్రతువులు నిర్వహించారు. ఉదయం స్వామిఅమ్మవార్లను తిరువీధి సేవ ద్వారా యాగస్థలి ప్రవేశం చేయించారు. అనంతరం చతుస్థానార్చన, విమాన దుగ్దేవతా విశేష హోమాలు, పంచ విశంతి కలశ స్నాపనం, మూల మంత్ర మూర్తి మంత్ర హావనం, నిత్య పూర్ణాహుతి, నివేదన, నీరాజన మంత్రపుష్పం, శాత్తుమరై, తీర్ధ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, ద్వారాది కుంభార్చన, చతుస్థానార్చన, మూర్తి మంత్ర హోమాలు, ధాన్యాదివాసం, నిత్య పూర్ణాహుతి, నివేదన, తీర్ధ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలను నిర్వహించి తిరువీధి సేవ ద్వారా ఆలయంలోకి వేంచేయుట కార్యక్రమం చేపట్టారు.



Next Story