- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కాయ్ రాజా కాయ్… జేబులు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు..

దిశ,పెన్ పహాడ్ : మండలంలోని చీదెళ్ల గ్రామంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల జాతర గత నాలుగు రోజులుగా కొనసాగుతుంది. ఈ ఉత్సవాల్లో సందట్లో సడే మియా లాగా మూడు ముక్కలాట....భక్తుల జేబులను ఖాళీ చేస్తుంది. కాయ్ రాజా కాయ్ అంటూ గుండ్ల పట్టాల పై కొనసాగుతున్న ఈ జూదం భక్తులను జేబులు ఖాళీ చేసే వరకు వదలడం లేదు. ఈ ఆట నిర్వాహకులు ఆంధ్ర కు చెందిన (పెనుగంచిప్రోలు) కేటుగాళ్లు నిర్వహిస్తున్నారు.ఈ ఆట ద్వారా జాతరకు విచ్చేసిన భక్తులు అనేకమంది ఈ ఆట బారిన పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు.
పది సంవత్సరాలు జరిగే ఈ ఆట ఈసారి అనేక మందిని ఆకర్షిస్తుంది. ఇంత జరుగుతున్న రక్షణ కల్పించవలసిన పోలీసులు భారీగా ముడుపులు తీసుకుని ఈ ఆట వైపు కూడా చూడటం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆలయ కమిటీ వారు కూడా ఈ జూదాన్ని పట్టించుకోకపోవడం విశేషం సంతరించుకుంది. ఇలాంటి జుదాలకు అవకాశం కల్పించిన ఆలయ కమిటీని పలువురు వారి మనసులోనే నిందించుకుంటున్నారు. ఇప్పటికైనా మూడు ముక్కలాట పై నిఘా పెట్టి భక్తుల జేబులు ఖాళీ కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.