ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం పేరుతో దోపిడీ

by Aamani |
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం పేరుతో దోపిడీ
X

దిశ నల్లగొండ బ్యూరో: ఏ వస్తువు ఉత్పత్తి చేసిన ఆ ఉత్పత్తిదారులకు నచ్చిన ధరకు వస్తువును అమ్ముకుంటారు. కానీ రైతు మాత్రం తాను పండించిన పంటను తనకు గిట్టుబాటు అయిన ధరకు అమ్మే పరిస్థితి లేదు. దానికి తోడు తాలు, గోనెసంచి పేర్లతో అధికంగా ధాన్యం తూకం చేస్తూ రైతు కష్టాన్ని కొల్లగొడుతున్నారు. ఈ విషయాన్ని అధికారులకు అన్నదాతలు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకునే దిక్కు లేదు. దానికి తోడు అధికారులు మిల్లర్లు కేంద్ర నిర్వాహకులు కుమ్మక్కై అన్నదాతలు కష్టాన్ని కొల్లగొట్టేస్తున్నారు. తతంగమంతా ప్రతి ఏటా జరుగుతున్న పర్యవేక్షణ చేసే అధికారులు వీటి నివారణకు చర్యలు తీసుకోవట్లేదు..

ఉమ్మడి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు..

యాదాద్రి భువనగిరి జిల్లాలో 321 కేంద్రాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో 1089 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు అందులో 58 కేంద్రాల నుంచి 5750 టన్నుల ధాన్యాన్ని సేకరించారు.

సూర్యాపేట జిల్లాలో 327 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి నుంచి 10,300 మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేశారు.

నల్గొండ జిల్లాలో 363 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు 213 కేంధ్రాల నుంచి మాత్రమే ధాన్యం సేకరించారు. మొత్తంగా 92552 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు..

తూకం పేరుతో దోపిడీ....?

ఆరుగాలం కష్టపడి రైతు పంట పండిస్తున్నారు . అయితే ఆ ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్ కి వెళితే తూకం పేరుతో దోపిడీకి గురి చేస్తున్నారు. ప్రతి గోనె సంచిలో 40 కిలోల ధాన్యం నింపుతున్నారు. అయితే సంచి బరువును నిర్ణయించాల్సి ఉండగా అందుకోసం 4.650 కిలోల ధాన్యం తూకం వేయాల్సి ఉంటుంది. కానీ కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 43 కేజీల వరకు ధాన్యం తూకం వేస్తున్నారు. కానీ 40.650 కిలోల తూకం వేసినట్లు మాత్రమే అధికారులు రికార్డుల్లో నమోదు చేసి రైతుకు రసీదు అందజేస్తున్నారు. అంటే దాదాపు ధాన్యం బ్యాగ్ కు 2 నుంచి 3 కిలోల ధాన్యాన్ని తూకం పేరుతో నొక్కేస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. తూకం వేయాల్సిన దానికంటే ఎక్కువ ఎందుకు వేస్తారు అని రైతులు ప్రశ్నిస్తే వాళ్లపై ఎదురు దాడి చేయడం కాకుండా ధాన్యాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లి మేమేమైనా మిమ్మల్ని ఇక్కడికి పిలిచామా కేంద్రంలో ఇలాగే ఉంటుంది దిక్కున చోట చెప్పుకోండి అనే పద్ధతిలో రైతులను బెదిరిస్తున్న తెలిసింది.

కేంద్రాల నిర్వాహకులు అధికారులకు కుమ్మక్కు....?

రైతుల ధాన్యాన్ని అక్రమంగా కాజేసేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, అధికారులు కుమ్మక్కు అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే చిట్యాల మండలంలోని ఒక ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేయాల్సిన ధాన్యం కంటే అదనంగా తూకం వేయడాన్ని రైతు ప్రశ్నించాడు. దానికి నిర్వాహకులు స్పందిస్తూ అధికారులు చెప్పిందే చేస్తున్నాం.. మాకు సంబంధం లేదు అన్న పద్ధతిలో సమాధానం చెప్పినట్లు సమాచారం. అయితే అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవినీతి అక్రమాలకు చోటు లేకుండా పర్యవేక్షణ చేస్తున్నామని చేస్తున్నప్పటికీ అదంతా మాటలు వరకే ఉంది తప్ప ఆచరణలో రైతులకు అనుకూలంగా ఎక్కడ జరగట్లేదని విమర్శలున్నాయి. ఈ మధ్యనే నకిరికల్ మార్కెట్లో కూడా అధికంగా వేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తే అధికారులు విచారణ జరిపారు రైతులు చెప్పింది నిజమైంది. ఇదంతా జరుగుతున్న అధికారులు మాత్రం కాసులకు కక్కుర్తి పడి ఒకవైపు కేంద్ర నిర్వాహకులతో మరొకవైపు మిల్లర్లతో కలిసిపోతున్నట్లు విమర్శలు ఉన్నాయి.

రైతులను దోచుకుంటున్నారు : రామకృష్ణ, రైతు, చిన్న కార్తి.

వెలిమినేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మా ఊర్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ధాన్యం తూకం ఇష్టానుసారంగా చేస్తున్నారు.ఇదేంటి అని అడిగితే అధికారులు చేయమంటున్నారు. మీ ఇష్టం ఉంటే దాన్ని ఇవ్వండి లేకపోతే లేదు అని బదులిస్తున్నారు.



Next Story

Most Viewed