- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చేనేతలకు కోమటిరెడ్డి శుభవార్త

దిశ,చౌటుప్పల్: ప్రజలకు మంచి చేస్తుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కేటీఆర్, హరీష్ రావు, కవిత జీర్ణించుకోలేకపోతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో.. నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..చేనేత సమస్యలపై పోరాటంతో తన రాజకీయ రంగ ప్రవేశం జరిగిందని, చేనేత అన్నలకు తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అణగారిన వర్గాలు,పేదలు,నిరుద్యోగులు, రైతులు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమంలో స్వయంగా పాల్గొని..కులాలకు, మతాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఒక పార్టీదో,ఒక కుటుంబంతో కాదని, ప్రజాఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నామని తెలిపారు. గత పది సంవత్సరాల కాలంలో చేనేత కార్మికులకు న్యాయం జరగలేదన్నారు. గత ప్రభుత్వాలు చేనేత కార్మికులను, చేనేత రంగాన్ని కేవలం ఓట్ల కోసం వాడుకున్నారే తప్పా నిజమైన ప్రేమ చూపించలేదన్నారు. ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డితో మాట్లాడి నేతన్నలకు 350 కోట్ల రుణమాఫీ చేయించానని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నేతన్నలకు రుణమాఫీ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, చేనేత జౌళి శాఖ అధికారులు,స్థానిక చేనేత సంఘ నాయకులు పాల్గొన్నారు.