- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రుణమాఫీ అయిన రైతులు కాంగ్రెస్కు ఓటు వేయండి : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

దిశ,నల్లగొండ: రైతులు బ్యాంకుల్లో లోన్ తీసుకోండి.. డిసెంబర్లో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం.. అని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో పిలుపునిచ్చాడని, మార్చి వచ్చినా రైతులకు రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకులు రైతన్నలను ఇబ్బంది పెడుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ సీఎంపై ఫైర్ అయ్యారు. రుణమాఫీ అయిన రైతులు కాంగ్రెస్కు ఓటు వేయండి కాలేదు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. నల్లగొండలో జిల్లా కేంద్రంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.. కేసీఆర్ మీద నిన్న జనం చూపించిన ఆదరణ చూస్తే మనం ఎలా ఓడిపోయామో అర్ధం కాని పరిస్థితి ఉందన్నారు.
కానీ ఫలితాలు భిన్నంగా వచ్చాయని, మనం అందరం ఆత్మ విమర్శ చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పార్లమెంట్ ఎన్నికల్లో జరుగకుండా చూసుకోవాలని బీఆర్ఎస్ నాయకులను అలర్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, మన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉద్యోగాలు ఇచ్చినా చెప్పుకోలేదని గుర్తు చేశారు. భారత దేశ చరిత్రలోనే 73% జీతాలు పెంచినా ఉద్యోగులు మర్చిపోయారన్నారు. రైతులకు మేలు చేసిన నాయకుడు ఎవరు అంటే ఒక్క కేసీఆర్ మాత్రమే అన్నారు. నల్లగొండను వరి సాగు చేసేలా చేసిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించిన ఘనత కేసీఆర్ది అని గుర్తుచేశారు. ఫ్లోరైడ్ నీటిని నల్లగొండకు దూరం చేసిన విషయం మనం చెప్పుకోలేదు. మనం చేసిన సంక్షేమ ఫలాలు చెప్పుకోలేక పోయాం అందుకే మనం విఫలం అయ్యాం అని కేటీఆర్ నొక్కి చెప్పారు.