సూర్యాపేటని గుడుంబా రహిత జిల్లాగా తీర్చి దిద్దుదాం

by Sridhar Babu |
సూర్యాపేటని గుడుంబా రహిత జిల్లాగా తీర్చి దిద్దుదాం
X

దిశ, సూర్యాపేట : జిల్లాలో నాటుసారా తయారు చేసే వారిపై నిఘా పెట్టి అది లేకుండా చేద్దామని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. అందుకోసం పోలీసు,ఎక్సైజ్ శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంతోష్ రెడ్డి, జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నాయక్ లతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాటు సారా వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా నష్టపోయాయని,నేడు ఆ కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల నాటు సారా

మూలాలను తొలగించి పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని వెల్లడించారు. సారాయి తయారు చేసే గ్రామాలు, తండాలు, వ్యక్తులతో పాటు హాట్ స్పాట్స్ ను గుర్తించాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి సారాయి తయారీ సామాగ్రి బెల్లం, పట్టిక ఎక్కడ నుండి వస్తుందో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అలవాటుగా నేరాలకు పాల్పడే వారినిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు.

గత ఎన్నికల సమయంలో సారాయి, బెల్లం, పట్టిక కేసుల్లో ఉన్న వ్యక్తులను బైండోవర్ చేసి మళ్లీ ఇలాంటి నేరం చేయకుండా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా సంయుక్తంగా తనిఖీలు చేసి గుడుంబా రహిత జిల్లా కోసం అందరం కలసికట్టుగా కృషి చేద్దామని కోరారు. ఈ సమావేశంలో డీఎస్పీలు రవి, శ్రీధర్ రెడ్డి, డీసీఆర్బీ డిఎస్పీ మట్టయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్ లు,ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.



Next Story

Most Viewed