- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- రాశిఫలాలు
- ఫోటోలు
- ఆరోగ్యం
ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ లైన్ మెన్

దిశ, దామరచర్ల: మండల కేంద్రానికి చెందిన అసిస్టెంట్ లైన్ మెన్ బంటు సైదులు లంచం తీసుకుంటూ గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డాడు.మండల కేంద్రానికి చెందిన కర్ణం మోహన్ రెడ్డి అనే రైతు ట్రాన్స్ఫార్మ్ కనెక్షన్ కొరకు పోయిన ఏడాది అక్టోబర్ నెలలో మూడు డీడీలు కట్టి దరఖాస్తు చేస్తే ఈ సంవత్సరం మే నెలలో ట్రాన్స్ఫార్మ్ మంజూరు అయింది. మంజూరు అయిన ట్రాన్స్ఫార్మ్ స్తంభాలు, లైనింగ్ తదితర పనులను స్టార్ట్ చేయాల్సిందిగా అసిస్టెంట్ లైన్ మెన్ ను సంప్రదించగా రూ.3000 లంచం డిమాండ్ చేశాడు. అయితే చివరకు రూ.2500కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వ్యూహం పన్ని లంచం తీసుకుంటుండగా మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో ఏసీబీ ఇంచార్జీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో మెరుపుదాడి చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి అసిస్టెంట్ లైన్ మెన్ ను రేపు(శుక్రవారం)నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.