- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భూ సమస్యలపై సత్వరమే స్పందించాలి : జిల్లా కలెక్టర్

దిశ, సూర్యాపేట : జిల్లాలో భూసమస్యలపై సంబంధిత అధికారులు సత్వరమే స్పందించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లతో కలిసి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గ్రామాలు,పట్టణాల్లో నీటి ఎద్దడి రాకుండా సంబంధిత అధికారులు నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సూచించారు.ముఖ్యంగా గ్రామాల్లో జాబ్ కార్డ్ ఉన్న కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పనులు కల్పించాలని సూచించారు.
ప్రజాపాలన సేవ కేంద్రాలలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని, ఆ దిశగా ప్రత్యేక అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.రాబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో స్వీప్ కార్యక్రమాలు నియోజకవర్గాల వారీగా చేపట్టాలని,గత శాసనసభ ఎన్నికల్లో నియమించిన నోడల్ అధికారులు,సెక్టార్ అధికారులు ఎంతో నిబద్ధతతో పని చేశారని, లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే తరహ అధికారులు తమకు కేటాయించే విధులను సమర్థవంతంగా చేపట్టాలని ఆకాంక్షించారు.
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ప్రజావాణిలో వివిధ భూ సమస్యలపై 92 దరఖాస్తులు అందాయని,ఇతర శాఖల నుండి 39 కలిపి మొత్తం 131 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ అప్పారావు,డీఆర్డీఓ మధుసూదన్ రాజు,డిఎఫ్ఓ సతీష్ కుమార్, డిపిఓ సురేష్ కుమార్,డిఏఓ శ్రీధర్ రెడ్డి,వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.