ఎద్దుల పందాలు ప్రారంభించిన కోదాడ ఎమ్మెల్యే

by Naveena |
ఎద్దుల పందాలు ప్రారంభించిన కోదాడ ఎమ్మెల్యే
X

దిశ,మేళ్లచెరువు : మహాశివరాత్రి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న ఎద్దుల పందాలను కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి బుధవారం ప్రారంభించారు. పాల పండ్ల బండలాగుడు దశలో 11 జతలు పాల్గొనగా..అందులో మొదటి బహుమతి కడప జిల్లా పాలూరు మండలం పెద్దముడియం గ్రామానికి చెందిన హేమంత్ రెడ్డి ఎడ్ల జత 3510 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి సాధించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ గ్రామానికి చెందిన సంధ్య కు చెందిన ఎద్దుల జత 3452 అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతి గెలుపు గెలుచుకుంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి, ప్రవళిస్ రెడ్డి చెందిన ఎద్దుల గత 3381మూడో బహుమతి గెలుపొందినట్లు నిర్వాహకులు తెలిపారు.



Next Story

Most Viewed