కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతిమయం: శ్రీధర్ రెడ్డి

by Dishanational1 |
కేసీఆర్ కుటుంబం మొత్తం అవినీతిమయం: శ్రీధర్ రెడ్డి
X

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను భారతీయ జనతా పార్టీ నాయకులు దహనం చేశారు. నల్లగొండ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు కంకణాల శ్రీధర రెడ్డి మాట్లాడుతూ.. 'కేటీఆర్, కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా వాళ్ల అవినీతి మాయమైపోయింది. కనీసం పన్నెండు సంవత్సరాల తర్వాత పెట్టినటువంటి గ్రూప్-1 పరీక్షలు కూడా సక్రమంగా కండక్ట్ చేయలేక నిరుద్యోగుల మీద ఎక్కడ కూడా శ్రద్ధ వహించక స్కామ్ లో ఇరుక్కున్నటువంటి కవిత కోసం నేడు మంత్రివర్గం మొత్తం కూడా ఢిల్లీలో కూర్చున్నారు. ప్రశ్న పత్రం మీద మీటింగ్ లేదు. కేసీఆర్, కేటీఆర్ మొత్తం కూడా కవితని ఎట్లా అయినా జైలుకు పోకుండా కాపాడాలన్న ఆలోచన తప్ప నిరుద్యోగుల మీద ఆలోచన లేదు. ఇవాళ ఐదు పేపర్లు లీక్ అయితే మా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈటల రాజేందర్ ను అరెస్ట్ చేశారు. ఇటువంటి నిరసన కార్యక్రమాలు కూడా చేయకుండా ప్రభుత్వం సామాన్య ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ప్రజలు గమనిస్తున్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వంమే' అని ఆయన అన్నారు.

బీజేపీ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ.. 'ప్రశ్నాపత్రం లీక్ కు పాలపడ్డవారు ఎవరైనా ఎంతటివారైనా శిక్షించాలి. అప్పుడే ప్రజలకు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం వస్తుంది తప్ప లేనేట్లు అయితే మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం చేం' అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి, బీజేపి జిల్లా ఉపాధ్యక్షులు దాసోజు యాదగిరాచారి, బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు మోరిశెట్టి నాగేశ్వర్ రావు, బీజేపీ పట్టణ కార్యదర్శి చర్లపల్లి గణేష్, బీజేపి జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్, బీజేపీ జిల్లా కార్యదర్శి పోతేపాక లింగాస్వామి, బీజేపీ జిల్లా కోశాధికారి కంచర్ల విద్య సాగర్ రెడ్డి, కంకణాల నాగిరెడ్డి, యువ మోర్చ జిల్లా అధ్యక్షులు ఆయితరాజు సిద్దు, బొజ్జ నాగరాజు, దాసరి సాయి, మహేష్, నెవర్స్ నీరజ, దేవి, హైమావతి, తార తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed