విద్యాధర్ కు కామధేను జాతీయ పురస్కారం

by M.Rajitha |
విద్యాధర్ కు కామధేను జాతీయ పురస్కారం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అతడి సూక్ష్మ కళ మహా అద్భుత సృష్టి.. సూక్ష్మదర్శినితో చూస్తే తప్ప కనిపించని సూక్ష్మ కళాఖండాలను సృష్టించడంలో అతను దిట్ట. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం అంగడి కుర్మపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సూక్ష్మ కళాఖండాల నిపుణులు డాక్టర్ ముంజంపల్లి విద్యాధరచారి. అతడికి “కామధేను జాతీయ పురస్కారం 2024” సూక్ష్మ కళా రంగంలో దక్కింది. ఆదివారం ద బేగంపేటలోని ప్లాజా సమాగమంలో జరిగిన విశ్వగురు కార్యక్రమంలో అందజేశారు. హైకోర్ట్ జడ్జి సూరేపల్లి నంద, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సీఈవో సత్యవోలు రాంబాబు చేతుల మీదుగా కామదేను అవార్డు 2004 అందుకున్నారు. ఆవగింజపై ఆదిదేవుడు వినాయకుడి చిత్రాన్ని చిత్రించి జై గణపతి కి జై అంటూ తెలుగు అక్షరాలలో రాశారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరును తల వెంట్రుకపై ఆంగ్ల అక్షరాలలో రాసి ఆయనకే అందజేసి అభినందనలు అందుకున్నారు. ఒకే ఒక బియ్యపు గింజపై 133 తెలుగు అక్షరాలు గల జాతీయ గీతాన్ని రాసి అందరిని అబ్బురపరిచారు. ప్రపంచంలోనే అతి చిన్న తాళం, తాళం చెవి తయారు చేసి 2004 సంవత్సరంలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరును నమోదు చేసుకున్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సూది రంధ్రంలో ఆరు స్వర్ణ శివ లింగాలను అమర్చారు. గురివింద గింజలో ఇమిడే చదరంగాన్ని రూపొందించారు. ఫారెస్ట్ బీట్ పరీక్ష ప్రశ్నాపత్రంలో డాక్టర్ ముంజంపల్లి విద్యాధర్ చారికి సంబంధించిన ఒక ప్రశ్నను చేర్చడం అతడి సూక్ష్మ కళా ప్రతిభకు నిదర్శనం. భవిష్యత్తులో తన చేతిలో రూపుదిద్దుకున్న సూక్ష్మ కళాఖండాలతో హైదరాబాదు నగరంలో మ్యూజియంను ఏర్పాటు చేయాలన్నది తన లక్ష్యమని డా.విద్యాధర చారి ‘దిశ’కు వివరించారు.



Next Story