- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ పని చేస్తే.. ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా: కేఎ పాల్
దిశ, చౌటుప్పల్: 60 ఏళ్లుగా మునుగోడులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే ఆరు నెలలు అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఎ పాల్ హామీ ఇచ్చారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో బస్టాండ్ నుంచి వలిగొండ రోడ్డు వరకు ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ.. మునుగోడులో బడుగు బలహీనవర్గాల పాలన ఆరంభం కానుందని, కుటుంబ, కుల, మత పాలన వద్దని మన పాలన కావాలని అన్నారు.
గత 30 సంవత్సరాలుగా 150 దేశాల్లో తాను సేవలు అందించానని, మునుగోడులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం నియోజకవర్గంలో ఏడు వేల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట లో 12 వందల ఎకరాల్లో చారిటీ నిర్మించి అనాధలకు వితంతువులకు సొంతంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. మునుగోడులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే వివిధ దేశాల నుండి కంపెనీలను తీసుకువస్తానని అన్నారు. ఈ రోడ్ షోలో ప్రజాశాంతి పార్టీ మండలాల కోఆర్డినేటర్లు నరేంద్ర, కొండల్ గౌడ్, జేమ్స్, సుబ్రహ్మణ్యం, శ్రీను, పవన్ కళ్యాణ్, వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.