పోరాటాల గడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా...

by Kalyani |
పోరాటాల గడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా...
X

దిశ,శాలిగౌరారం: పోరాటాల పురిటి గడ్డ, నిజాం రజాకార్ల ను గడగడలాడించి తరిమి కొట్టిన గడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా అని మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతురావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లు అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో హైదరాబాద్ విలీనంలో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, అప్పటికి ఆ పార్టీనే పుట్టలేదని, అలాంటి బీజేపీ భారతదేశ చరిత్రనే తారుమారు చేసే స్థితిలో ఉందని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన 10 మంది విద్యార్థుల అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హన్మంతరావు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు మందుల సామెల్,వేముల వీరేశం లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వి. హన్మంతరావు, కిరణ్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ… హైదరాబాద్ విలీన దినం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ విలీనంలో ఎటువంటి పాత్రలేని వారు కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సెప్టెంబర్ 17 గురించి మాట్లాడే అర్హత అమిత్ షాకు లేదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణా సాయుధ పోరాటానికి కేంద్ర బిందువన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆనాటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను దేశంలో ఉన్న అన్ని సంస్థానాలను దేశంలో అంతర్భాగం చేయాలని కోరారన్నారు.

ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆదేశాల మేరకు నిజాం పన్నిన పన్నాగాలను పటేల్ బద్దలు కొట్టాడన్నారు. నలువైపులా భారతదేశ బలగాలను చుట్టుముట్టి నిజాం లొంగిపోయేలా చేశాడన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు,బీజేపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం సర్దార్ పటేల్ వద్ద లొంగిపోవడంతో హైదరాబాద్ భారత యూనియన్ లో విలీనం అయిందన్నారు రజాకార్లకు వ్యతిరేకంగా మొదటగా నల్లగొండ జిల్లా నుంచి ఉద్యమాలు మొదలయ్యన్నారు. వల్లాల గ్రామం లో అమరులైన విద్యార్థుల కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించి వారి త్యాగాలను చరిత్ర పాఠ్య పుస్తకాల్లో ప్రచురించి, నేటి తరం విద్యార్థుల కు దేశ భక్తి పెంపోదించే విధంగా కృషి చేయాలని రేవంత్ రెడ్డిని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లు మందుల సామెల్ ,వేముల వీరేశం మాట్లాడుతూ… వల్లాల గ్రామంలో అమరులైన విద్యార్థుల చరిత్రను తెలుసుకుని ఇక్కడికి వచ్చి అమరుల స్థూపాల నిర్మాణానికి హనుమంత రావు నడుము బిగించడం అభినందనీయమన్నారు. స్థూపం నిర్మాణానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఎంతో మంది నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి అమరులయ్యారని, వారి త్యాగం, దేశభక్తి మరువరానిదన్నారు. అనంరం శాలిగౌరారం మండల కేంద్రంలోని సర్దార్ వల్లభాయి పటేల్ కు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సభ్యులు చామల శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అన్నె బోయిన సుధాకర్, మండల అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, నాయకులు నూక కిరణ్ కుమార్, జైహింద్ గౌడ్,షేక్ ఇంతియాజ్, దండ అశోక్ రెడ్డి, నకిరేకల్ మున్సిపాలిటీ ఇంఛార్జి చైర్మన్ మురారిశెట్టి, ఉమారాణి కృష్ణమూర్తి, బండపెల్లి కొమరయ్య, గూని వెంకటయ్య, చామల వెంకటరమణారెడ్డి, భూపతి వెంకన్న,నోముల జనార్దన్ , మాదగోని రామలింగయ్య, భూపతి అంజయ్య, చింత ధనంజయ, వేముల గోపినాథ్, నిమ్మల కృష్ణ, లోడంగి మహేష్, నూక కిషోర్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed