రంగంలోకి దిగిన జానారెడ్డి.. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో భేటీ

by Disha Web Desk 23 |
రంగంలోకి దిగిన జానారెడ్డి.. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలతో భేటీ
X

దిశ, మిర్యాలగూడ : కాంగ్రెస్ ప్రతిష్టను కాపాడేందుకు అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా ముందుకు సాగుతామని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మిర్యాలగూడ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జానారెడ్డి మాట్లాడుతూ, పీసీసీ డీసీసీ ఆదేశాలకు అనుగుణంగా నాయకులు పని చేయాలని సూచించారు. నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు వీడేలా డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి లతో ప్రత్యేకంగా మాట్లాడి పార్టీ బలోపేతం కోసం కృషి చేసేలా ఆదేశించినట్లు పేర్కొన్నారు. సస్పెండ్ చేసిన వారిని జానా సమక్షంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈనెల 26 నుంచి నియోజకవర్గ పరిధిలోని వేములపల్లి మండలం ఆమనగల్ నుంచి జోడోయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు జానారెడ్డి ప్రకటించారు.

జూడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అందరూ పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. నియోజకవర్గం పరిధిలో జోడో యాత్ర తేదీలను ప్రకటిస్తామన్నారు. సమావేశంలో పీసీసీ సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి నాయకులు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, పొదిలి శ్రీనివాస్, తమ్మన బోయిన అర్జున్, శ్రీనివాస్, ఆరిఫ్, సలీం, చిలుకూరి బాలు, పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి బసవయ్య గౌడ్, సైదులు మాదిగ, కోట శ్రీనివాసరావు, వెంకటేష్ గౌడ్, కాంత రెడ్డి, అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed