- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులు...ఎంతమంది అంటే.?

దిశ,నల్లగొండ బ్యూరో : భూమిలేని నిరుపేదల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించేందుకు కార్యాచరణ అమలు చేస్తుంది రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు భూమిలేని వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా రూ.12000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రక్రియ కు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రమాణికంగా తీసుకుంటుంది. అందులో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులైన మహిళ కూలీలను గుర్తించినట్లు సమాచారం. ఈ పథకాన్ని జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా అట్టహాసంగా ప్రారంభించనున్నారు.
-ఉమ్మడి జిల్లాలో ఈజీ ఎస్ కార్డులు....
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధి హామీ కార్డులు 15,98,105 ఉన్నాయి. అందులో మహిళ కూలీలు 8,08,973 ఉన్నారు. అయితే అందులో ఇందీరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 70,288 మంది భూమి లేని మహిళా కూలీలు ఎంపికయ్యారు. అందులో భాగంగానే జిల్లాల వారీగా...
నల్లగొండ జిల్లాలో...
--- ఉపాధి హామీ కార్డులు: 764358
--- మహిళా కూలీలు : 380613
--- అర్హులైన కూలీలు : 25603
సూర్యపేట జిల్లాలో
-- మొత్తం ఈజీఎస్ కార్డులు : 570265
-- మహిళా కూలీలు : 285748
-- అర్హత కలిగిన కూలీలు:: 27918
యాదాద్రి భువనగిరి జిల్లా లో
--మొత్తం ఈజీఎస్ కార్డులు :: 263482
--- మహిళా కూలీలు:: 142612
--- అర్హత కలిగిన కూలీలు:: 16767
---- ఏడాదికి రూ.84.35కోట్లు....
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హత సాధించిన పేద మహిళ కూలీలు 70,288 మంది ఎలా తో సాధించారు. వీరి కోసం ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.84.35కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అందులో కూడా జిల్లాల వారీగా చూస్తే నల్లగొండ జిల్లాకు రూ.30.72కోట్లు, సూర్య పేట జిల్లా కు రూ.33.50కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాకు రూ. 20.12కోట్లు వినియోగించనున్నారు.
గ్రామసభల్లో చేర్పులు మార్పులు....
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులైన జాబితాను ఇప్పటికే తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మూడు రోజులు జరిగే గ్రామ సభల్లో ఈ జాబితాను ప్రజల ముందు పెట్టి మార్పులు, చేర్పులు చేసే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే 20 రోజులకు ఒక్కరోజు తక్కువ ఉన్న పథకానికి అర్హత ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో కొంత నిరసన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అర్హులైన లబ్ధిదారుల జాబితాను అధికారులు రాత్రి జిల్లా లకు పంపించారు. కానీ ఆ తర్వాత వెంటనే జాబితాలో చేర్పులు మార్పులు చేసే అవకాశం ఉంది.కాబట్టి గ్రామ సభల్లో విడుదల చేయకూడదని క్షేత్రస్థాయి అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అందుకే మార్పులు , చేర్పులు కచ్చితంగా ఉంటాయని స్పష్టంగా తెలుస్తోంది.