- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రమాదాలకు నిలయాలుగా కేబుల్ గుంతలు..

దిశ, మర్రిగూడ : రహదారుల వెంట ఎయిర్టెల్ కేబుల్ కోసం తీసిన గుంతలు పూడ్చక పోవడంతో ప్రమాదాలకు నిలయాలుగా మారి ప్రయాణికులకు ప్రాణసంకటంగా ఉంది. నెలల తరబడి తీసిన గుంతలు పూర్చకపోవడం పూడ్చిన అసంపూర్తిగా కూర్చడంతో నిత్యం ప్రయాణికులు గుంతలో పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా ఎందరో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మర్రిగూడ మండలంలో ఎర్రగండ్లపల్లి , మర్రిగూడ మండల కేంద్రంలో డబల్ రోడ్డుకు ఒకవైపున ఎయిర్టెల్ లైన్ కోసం తీసిన గుంతలు కేబులు వేసిన తర్వాత కూడా పూర్చకపోవడంతో ప్రయాణికులు ఎందరో గుంతలో పడి ప్రమాదాలకు గురై ఆసుపత్రుల పాలయ్యారు.
మర్రిగూడ మండలం నుండి నాంపల్లి వరకు తీసిన కేబుల్ లైను పూర్తి చేయకపోవడంతో తీసిన గుంతలో వాహనదారులు రాత్రిపూట గుంతల్లో పడి ఎందరో ఆసుపత్రుల పాలయ్యారు. నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ బస్టాండ్ నుండి గుర్రంపొడుకు వెళ్లే రహదారిలో తీసిన కేబుల్ గుంత సక్రమంగా పూర్చకపోవడంతో ఎస్సీ కాలనీకి వెళ్లే కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఎన్నిసార్లు సంబంధిత కాంట్రాక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కేబుల్ వేసిన కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చి ప్రమాదాలకు గురైన వారికి నష్టపరిహారం చెల్లించి కేబుల్ గుంతలు పూడ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.