- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పంట పొలాల్లో... పసికందు కలకలం
by Naresh |

X
దిశ, చండూరు: గుర్తు తెలియని శిశువు లభ్యమైన సంఘటన సోమవారం చండూరు మండలంలో కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంగారు గడ్డ గ్రామానికి చెందిన సుంకరి యాదయ్య వ్యవసాయ భూమిలో మధ్యాహ్నం సమయంలో అప్పుడే పుట్టిన శిశువు ఏడుపు వినిపిస్తుండటంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా మగ శిశువును గుర్తు తెలియని మహిళ వదిలి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. శిశువును చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు వారు తెలిపారు. గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.
Next Story