- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఢిల్లీలో మోడీ భువనగిరిలో బూర గెలుపు ఖాయం

దిశ, చిట్యాల: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ నియోజకవర్గం నుంచి తాను, ఢిల్లీలో నరేంద్ర మోడీ విజయం ఖాయమని భువనగిరి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం చిట్యాల మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావ లాంటిదని ఆ పార్టీకి ఢిల్లీలో గల్లీలో నూకలు చెల్లిపోయాయని విమర్శించారు.
కేసీఆర్ పై కోపంతోనే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తప్పా కాంగ్రెస్ మీద నమ్మకంతో కాదన్నారు. గతంలో తాను ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం 9 వేల కోట్ల నిధులు తీసుకువచ్చి భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. అలాగే ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునాది గాని కాలువల పూర్తి కోసం 300 కోట్లు మంజూరు చేయిస్తే అప్పటి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ నిధులను పంచుకుని తిన్నారని ఆరోపించారు.
ఇలాంటి నీచ, అవినీతి రాజకీయాలకు ఒడిగట్టిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్, లిక్కర్ స్కాం, ఫోన్ ట్యాపింగ్ అంశాలపైనే దృష్టి సారించింది తప్ప ప్రజా సంక్షేమంపై కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాటకు ముందు నా దగ్గర నిధులు లేవని కాలికుండలు మాత్రమే ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఈసారి ఎన్నికల్లో తాను రెండు లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అలాగే కేంద్రంలో బీజేపీ సుమారు 400 సీట్లను గెలుచుకోనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశం యావత్తు మోడీ పాలన కోరుకుంటుందని, ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కూరెళ్ళ శ్రీనివాస్ శ్రీను సీనియర్ నాయకులు కంబాలపల్లి సతీష్, కన్నబోయిన మహాలింగం, మాస శ్రీనివాస్, గంజి గోవర్ధన్, బూత్ అధ్యక్షుడు ఉదయ్ పాల్గొన్నారు.