అక్రమ ఇసుక రవాణా పై అధికారుల ఉక్కుపాదం..

by Sumithra |
అక్రమ ఇసుక రవాణా పై అధికారుల ఉక్కుపాదం..
X

దిశ, కోదాడ : అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రీచ్ లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే అక్రమంగా దొంగతనంగా కోదాడ మండలం మంగళ్ తండా గ్రామంలో అక్రమంగా ఇసుకను డంపు చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేశారు.

మంగళ్ తండా గ్రామ గ్రామానికి చెందిన రామావత్ జబ్బార్ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా, దొంగతనంగా సుమారు 30 ట్రిప్పుల ఇసుకను వాగులో నుండి తరలించి మంగళ్ తండా గ్రామ శివారులో డంపు చేసారు. కోదాడ తహశీల్దార్ ఎండి.వాజిద్ ఇసుక డంపును సీజ్ చేసి దరఖాస్తు ఇవ్వగా రామవత్ జబ్బార్ పై కేసు నమోదు చేసినట్లు కోదాడ రూరల్ ఎస్సై ఎం. అనిల్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed