- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాఠశాలలో, కళాశాలలో ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి

దిశ, గరిడేపల్లి: పాఠశాలలో, కళాశాలలో ఏదైనా సమస్యలు నా దృష్టికి తీసుకురండని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. మండలంలోని గడ్డి పల్లి శివారులో ఇటివల సీజ్ అయిన ఒక రైస్ మిల్లును ఆయన పరిశీలించారు. అనంతరం మోడల్ కళాశాల, పాఠశాలను ఆయన తనిఖీ చేసి తరగతి గదులను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు కొద్దిసేపు పాఠాలు బోధించిన ఆయన పాఠశాలలో, కళాశాలలో ఏదైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. టాయిలెట్స్ సక్రమంగా లేవని వారు తెలపగా ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మోడల్ స్కూల్ కి సమీపంలో ఉన్న ఎస్సీ వసతి గృహాన్ని సందర్శించారు.
అనంతరం గరిడేపల్లి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేసి ఆరోగ్య కేంద్రంలో స్టాక్ రిజిస్టర్ ని అడిగి రాపిడ్ టెస్టులపై ఆరా తీశారు. ల్యాబ్ టెక్నిషియన్ లేకపోవటంతో వివరాలు అడగగా సెలవులో ఉన్నట్లు వైద్యాధికారి తెలిపారు. ఆరోగ్య కేంద్రంలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడంతో వెంటనే డి ఎం హెచ్ వో కి ఫోన్ చేసి ఆరోగ్య కేంద్రం పరిస్థితి బాగాలేదని ఒకసారి పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన పాఠశాలలో ఏమైనా సమస్యలున్నాయా అని అడుగగా పాఠశాలకు ప్రహరీ గోడ లేక ఇబ్బందులు పడుతున్నట్లు మండల విద్యాధికారి చత్రు నాయక్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు.
పాఠశాల ఆవరణ, విద్యార్థుల టాయిలెట్స్ విషయాన్ని పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ప్రజాపాలన ప్రత్యేక కౌంటర్ ను పరిశీలించిన ఆయన అర్హులైన వారు సంక్షేమ పథకాలు అందకుంటే ఈ కౌంటర్ లో ఫిర్యాదు చేయాలని, అంతేకాకుండా గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఇచ్చిన దరఖాస్తులలో ఏదైనా తప్పులుంటే సరి చేస్తారని తెలిపారు. అక్కడి నుంచి తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఆయన రిజిస్ట్రేషన్ విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ఒక్క మండలం లో ఆయన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తిరుగుతూ సుమారు రెండు గంటల సమయాన్ని కేటాయించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కవిత, ఇన్చార్జి ఎంపిడివో సోమసుందర్ రెడ్డి, మండల విద్యాధికారి చత్రు నాయక్, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.