- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు : ఎస్పీ

దిశ , సూర్యాపేట : క్షణికావేశంలో నేరాలకు పాల్పడిన ఎంతటి వారైనా చట్టపరంగా చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. ఈ నెల 23న సూర్యాపేటలో ఓ యువకుడి కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితుల వివరాలను ఎస్పీ జిల్లా కార్యాలయంలో అదనపు ఎస్పీ మేక నాగేశ్వర్ రావు తో కలిసి విలేఖరుల సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన వెంకటేష్ ప్రైవేటు హౌసింగ్ లోన్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా 2022 లో తన స్నేహితుడైన బెజవాడ రాజశేఖర్ తో నెలకొన్న డబ్బుల పంచాయితీ విషయంలో అతన్ని హతమార్చాడు. తదనంతరం అతని కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉందని తలంచిన వెంకటేష్ సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలోని తన పెద్దమ్మ ఇంట్లో నివాసం ఉంటున్నాడు.
రాజశేఖర్ హత్యకు ప్రతీకారంగా వెంకటేష్ ని హత్య చేయుటకు అతని సోదరులు,స్నేహితులను బెజవాడ రమేష్, ఖమ్మంపాటి సైదులు, రమేష్, బెజవాడ జానయ్య, బోడ సతీష్,ఇస్లావత్ సురేష్ లు ఈనెల 23న తెల్లవారుజామున టిఎస్ 12 ఈసీ 6648 గల వాహనంలో వెంకటేష్ ని వెంబడించి రాజుగారి తోట సమీపంలోని అతన్ని ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టారు. దీంతో కిందపడ్డ వెంకన్నని బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించుకొని తమ వెంట తెచ్చుకున్న తాడుతో మెడకు చుట్టి హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి కాల్చి వేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసును త్వరితంగా ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, రూరల్ సీఐ వై.సురేందర్ రెడ్డి, ఎస్సై బాలు నాయక్ తో పాటు సిబ్బందిని అభినందించారు.