ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను స్వయంగా ఎంపిక చేస్తాను: ఎమ్మెల్యే

by Naveena |
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను స్వయంగా ఎంపిక చేస్తాను: ఎమ్మెల్యే
X

దిశ, నకిరేకల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను అధికారులతో కలిసి స్వయంగా ఎంపిక చేస్తానని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రాబోయే ఏడాది జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడలో తన క్యాంపు కార్యాలయంలో.. కట్టంగూర్ మండల లబ్ధిదారులకు మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువల పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను అందించనున్నట్లు పేర్కొన్నారు. మన నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. 25 ఎకరాల్లో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చలేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మాద యాదగిరి, సుంకర బోయిన నరసింహ, మండల పార్టీ అధ్యక్షులు పెద్ది సుక్కయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed