- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎంతకు తెగించారు…మాకు నో రూల్స్ అంటున్న సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ..

దిశ, హుజూర్ నగర్ / మఠంపల్లి : ప్రభుత్వ రూల్స్ తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుంది సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలోని సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం. రిపబ్లిక్ డే సందర్భంగా ఎక్కడ జీవహింస చేయరాదని ప్రభుత్వ ఆదేశాలే ఉన్నాయి. కానీ ఆ నిబంధనలు తమకేమీ పట్టనట్టు సాగర్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం వ్యవహరించింది.ఆదివారం ఆ ఫ్యాక్టరీ 44వ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ సుమారు 5000 మందికి భోజనాలు ఏర్పాటు చేసింది. ఈ భోజనాలను శాఖాహారం తో పాటు 45 గొర్రె పొట్టేలతో... 14 క్వింటాళ్ల మటన్ 15 క్వింటాళ్ల చికెన్ 2 క్వింటాళ్ల చేపలు 3 క్వింటాళ్ల రొయ్యలతో .. అక్కడ వారికి నాన్ వెజ్ తో వంటకాలు తయారు అందించినట్లు తెలుస్తుంది .
ఇంత పెద్ద ఎత్తున మాంసంతో భోజనం ఏర్పాటు చేస్తున్నా సంబంధించిన స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మాంసాహారంతో భోజనాలు పెడుతున్న విషయం అధికారులకు తెలిసిందా.. !?లేక తెలిసి కూడా మనకేమీ పట్టలేదు అన్నట్లుగా వ్యవరిస్తున్నారా ..?అనే ప్రజల్లో చర్చ జరుగుతుంది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ విషయం తెలిసిన వారు కొందరు రిపబ్లిక్ డే అని తెలిసి కూడా ఎలా జీవహింస చేస్తారంటూ పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రిపబ్లిక్ డే నిఅవమానిచ్చే విధంగా ఈ పరిస్థితి ఉందని దీనిపై ఉన్నత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.దీనిపై వివరణ కోరేందుకు మఠంపల్లి తహసీల్దార్ మంగకు ఫోన్ చేయగా విషయం తమకు తెలియదని తమ ప్రస్తుతం ప్రభుత్వ స్కీమ్ పంపిణీ లో భాగంగా బిజీగా ఉన్నామని తెలిపారు.