దుమ్ముతో ప్రయాణం సాగేదెలా..?

by Naveena |
దుమ్ముతో ప్రయాణం సాగేదెలా..?
X

దిశ, గరిడేపల్లి: మండల కేంద్రం గరిడేపల్లిలో కల్మలచెరువు రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ద్విచక్రవాహనదారులు భయంభయంగా ప్రయాణం సాగిస్తున్నారు. దుమ్ము, దూళితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల గరిడేపల్లి నుంచి అలింగాపురం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టగా..రోడ్డును తవ్వి దుమ్ముతో కూడిన కంకరను పరిచారు. ఆయా రోడ్డుపై ప్రతిరోజు మూడు పూటలా దుమ్ము లేవకుండా నీరు కొట్టాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో..రోడ్డు పై నీరు కొట్టడం లేదు. రోడ్డుపై ఉన్న దుమ్ము ఎగిరి ప్రయాణికుల కండ్లలో పడితే ప్రమాదాలు జరిగి అవకాశాలు ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. మంత్రి పర్యటన జరిగినప్పుడు నీళ్లు పోస్తున్నారు..తప్ప మిగతా రోజులు నీళ్ళు పోసేవారే లేరని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం రోడ్డుపై నీటిని చల్లి దుమ్ము నుండి ప్రజలను రక్షించాలని పలువురు కోరుతున్నారు.



Next Story

Most Viewed