- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Attack : కస్టమర్లపై హోటల్ యాజమాన్యం దాడి

దిశ, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని స్వాగత్ గ్రాండ్ హోటల్ యాజమాన్యం హోటల్ కు వచ్చిన కస్టమర్లపై మంగళవారం రాత్రి దాడి చేయడంతో కస్టమర్లు నిరసన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ పట్టణంలో టూ టౌన్ పరిధిలో గల స్వాగత్ గ్రాండ్ హోటల్ లో పట్టణానికి చెందిన పలువురు వ్యక్తులు మద్యం సేవించడానికి వచ్చారు. మద్యం సేవించిన అనంతరం బిల్లు విషయంలో వివరణ కోరగా హోటల్ యాజమాన్యం కస్టమర్లపై దాడి చేసి గాయపరిచారు. దీంతో కస్టమర్లు హోటల్ ముందు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సద్ది చెప్పడంతో పాటు ఫిర్యాదు చేయాల్సిందిగా కోరడంతో గాయపడిన కస్టమర్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతోపాటు ఈ హోటల్ పై పలు రకాల ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో యాజమాన్యం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్లు బాధితులు ఆరోపించారు.