- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సంక్రాంతి రద్దీ.. పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్..

దిశ, చౌటుప్పల్ : రాష్ట్రంలో సంక్రాంతి పండగకు వారం రోజులు వరుస సెలవులు రావడంతో శుక్రవారం సాయంత్రం నుండి తమ సొంత ఊర్లకు వెళ్లేవారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. శనివారం తెల్లవారుజామున ఈ రద్దీ మరింత పెరిగింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సొంత వాహనాలలో పండగకు ఊరు వెళ్లే వారితో రద్దీగా మారింది. జాతీయ రహదారుల సంస్థ అధికారులు పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాల లైన్ల సంఖ్య పెంచినా రద్దీ మాత్రం తగ్గలేదు.
వరుస సెలవులు ప్రారంభం కావడంతో శనివారం తెల్లవారు జాము నుండి టోల్ ప్లాజా వద్ద రద్దీ ఏర్పడింది. ఫాస్ట్ట్యాగ్ ఉన్న పండగ సమయాలలో పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ మాత్రం తగ్గడం లేదు. పంతంగి టోల్ ప్లాజా వద్ద మరికొన్ని వాహనాల లైన్ల సంఖ్యను పెంచి పండగ సమయాలలో రద్దీ నుంచి ఉపశమనాన్ని కలిగించాలని వాహనదారులు వేడుకుంటున్నారు. ఈ రద్దీ రేపటి వరకు ఇలాగే కొనసాగే అవకాశం లేకపోలేదు. విజయవాడ వైపు వెళ్లే వాహన దారులు హైదరాబాద్ నుంచి వచ్చే సమయంలో ఉప్పల్ మీదుగా భువనగిరి నుండి చిట్యాల కు వెళ్తే ఈ రద్దీ నుంచి తప్పించుకోవచ్చు.